MPలోని షియోపూర్ జిల్లాలో కునో నేషనల్ పార్క్ నుంచి పొలాల్లోకి వచ్చిన ఐదు చీతాలకు స్థానికులు నీరు అందించి దాహం తీర్చారు. కొన్ని రోజుల క్రితం ఇవి మేకలు, దూడలపై దాడి చేయడంతో చీతాలపై స్థానికులు రాళ్లదాడి చేశారు. ఇప్పుడు వీటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆహారం అందించేందుకు ముందుకొచ్చారు. అయితే, అధికారులు మాత్రం చీతాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.