AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలోని జీనియస్ స్కూల్లో అమానుష ఘటన జరిగింది. హోంవర్క్ రాయలేదనే కారణంతో రెండో తరగతి విద్యార్థులను టీచర్ అనిత చెప్పుతో కొట్టింది. ఈ విషయాన్ని చిన్నారులు పేరెంట్స్ కు చెప్పడంతో వారు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది. కాగా పిల్లలను చెప్పుతో కొట్టడంపై నెటిజన్లు ఫైరవుతున్నారు.
హోంవర్క్ చేయలేదని విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్
11
Apr