AP: డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న అన్నా లెజినోవా.. వేంకటేశ్వరస్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్న విషయం తెలిసిందే.
శ్రీవారి సుప్రభాత సేవలో పవన్ సతీమణి
15
Apr