AP: కడపలోని ఒంటిమిట్ట కోదండరామయ్యకు కన్నుల పండువగా పుష్పయాగం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగియగానే స్వామి వారికి పుష్పయాగం, ఏకాంత సేవ చేయడం సంప్రదాయం. ఈ యాగానికి 2.5 టన్నుల 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను తీసుకొచ్చి సీతారాములకు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తమను కాపాడాలని స్వామివారిని ప్రార్థించారు
కోదండరాముడికి పుష్పాభిషేకం
19
Apr