AP: మదనపల్లెకు చెందిన ఓ విద్యార్థి జేబులో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. రాయచోటికి చెందిన తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లు మిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇవాళ కళాశాలకు వస్తుండగా అకస్మాత్తుగా ప్యాంటు జేబులోని మోటో ఫోన్ పేలింది. వెంటనే అప్రమత్తమైనప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
మొబైలు జేబులో పెట్టుకుంటున్నారా?
24
May