AP: అల్లూరి జిల్లా కురిడి గ్రామస్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోటలో ఆర్గానిక్గా పండించిన మామిడి పండ్లు కానుకగా పంపారు. ఆ గ్రామంలోని 230 ఇళ్లకు అర డజను చొప్పున పంపిణీ చేశారు. మామిడి పండ్లను తింటూ ఆదివాసీలు తెగ మురిసిపోయారు. పవన్ తమను గుర్తు పెట్టుకుని మరీ పండ్లు పంపడం ఆనందంగా ఉందన్నారు.
కాగా ఇటీవల ‘అడవి తల్లి బాట’ ప్రోగ్రామ్లో భాగంగా పవన్ కురిడిలో పర్యటించిన విషయం తెలిసిందే.