AP: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై అల్లూరి జిల్లా పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేశారు. రాముడి ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఈవో, అధికారులు వెళ్లగా గ్రామస్థులతో వాగ్వాదం జరిగింది. అనంతరం కొందరు దాడి చేయడంతో ఈవో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు(భూములు రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి) ఇటీవలే ఆదేశించింది.
భద్రాచలం ఈవోపై దాడి
09
Jul