AP: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో 20,494 ఎకరాల భూమిని సమీకరించే అంశంపై మంత్రి మండలి ఆమోదం ఇవ్వనుంది. అంతేకాదు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని సమాచారం. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.
ఆడబిడ్డ నిధి పథకం’ కింద మహిళలకు నెలకు .1500!
09
Jul