ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా మహాకూటమి బిహార్ బంద్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బంద్ సందర్భంగా కొందరు RJD నాయకులు పట్టాలపై నిరసనకు దిగి, రైలును ఆపేందుకు విఫలయత్నం చేశారు. పట్టాలపై బైఠాయించి ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అయితే నిరసన సమయంలో అటుగా వచ్చిన రైలు ఆగకుండా దూసుకెళ్లింది. అప్రమత్తంగా ఉండటంతో ఎవరూ గాయపడలేదు. కాగా ఎర్రజెండాలు పట్టుకుంటే రైలు ఆగేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పట్టాలపై నిరసన.. దూసుకెళ్లిన రైలు
11
Jul