పురుగుమందు తాగి రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కాగజ్నగర్(M) పాత సార్సాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ భూవివాదంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని గురువారం పురుగుమందు తాగారు. ఈస్గాం పోలీసులు లంచం అడిగారని, ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని వీడియో తీసుకున్నారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసులు అన్యాయం చేశారంటూ రైతు సూసైడ్
12
Jul