తమిళనాడు తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణలో తెలుగు వారిపై వివక్ష చూపుతున్నారని భక్తులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఘటనతో అరుణాచలంలో తెలుగువారి భద్రతపై అనుమానాలు మరింత పెరిగాయి. TG యాదాద్రి(D) సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్(32) జులై 7న తిరువణ్ణామలైలో హత్యకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు అతడి గొంతుకోసి రూ.500 కాజేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు గుగనేశ్వరన్ (22), తమిళరసన్ (25)లను అరెస్టు చేశారు
అరుణాచలంలో తెలుగు వ్యక్తి హత్య.. ఇద్దరు అరెస్ట్
14
Jul