AP: కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో జాగిలంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని బైక్ పై తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా లోకేష్ కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. లోకేష్ వేధింపులు తాళలేక సొంత ఊరు వదిలి వచ్చామని మృతురాలి తండ్రి కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
మైనర్ బాలిక హత్య… ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
17
Jul