ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ను వేధించిన కేసులో టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషాకు ముంబై కోర్టు రూ.100 జరిమానా విధించింది. FEB 15, 2023న అంధేరీలోని ఓ పబ్లో పృథ్వీషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సప్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలని షాకు పలుమార్లు అవకాశమిచ్చినా స్పందించకపోవడంతో ఫైన్ విధించింది.
లైంగిక వేధింపుల కేసులో పృథ్వీషాకు రూ.100 ఫైన్
11
Sep