AP: వైసీపీ తన పాలనలో న్యాయవాదుల సంక్షేమాన్ని విస్మరించిందని మంత్రి ఫరూక్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటోందని వివరించారు. ఇందులో భాగంగా 2020 ఏప్రిల్ నుంచి మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రూ.46కోట్లు రిలీజ్ చేసినట్లు వెల్లడించారు. న్యాయవాది కుటుంబానికి సంక్షేమ నిధి ఇచ్చే మొత్తానికి అదనంగా రూ.4లక్షలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
న్యాయవాదుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నాం: ఫరూక్
09
Nov