లోక్సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని కోరినట్లు ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమ ప్రతిపాదనపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా రాహుల్ వయనాడ్ స్థానాన్ని వదులుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోండి: రాహులన్ను కోరిన పార్టీ నేతలు
09
Jun