మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో కంట్రోలర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం బస్టాండ్లోకి కారులో వచ్చి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారు. దీన్ని గమనించిన కంట్రోలర్ జమాల్ పాషా వాహనాన్ని అక్కడ నుంచి తీయాలని వారితో చెప్పారు. దీంతో కారులో వచ్చిన వారు కంట్రోలర్ పై దాడికి పాల్పడ్డారు. దాడి విషయంపై జమాల్ పాషా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంచిర్యాల : ఆర్టీసీ కంట్రోలర్ పై దాడి
12
Jun