ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. వివరాలకు వెళ్తే గురువారం ఉదయం పట్టణంలోని ఖుర్షీద్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఒక మహిళ మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది. సమాచారం తెలుసుకున్న DSP జీవన్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక రిమ్స్ మార్చురీకి తరలించారు. మహిళ ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ లో మహిళ మృతదేహం
13
Jun