TG: కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి ₹20 పలకగా ఇప్పుడు ₹40-50కి చేరింది. టమాటా ₹60-90, వంకాయ ₹40-50, పచ్చి మిర్చి ₹80-120 ధర పలుకుతోంది. బీన్స్, క్యారట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపు అయ్యాయి.
ప్రజలకు కూర’గాయాలు’.. భారీగా పెరిగిన ధరలు
14
Jun