ఐస్క్రీమ్ మనిషి వేలు, హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుక వచ్చిన ఘటనలు మరువకముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది.
గుజరాత్ అహ్మదాబాద్లోని ప్రసిద్ధ దేవి దోస రెస్టారెంట్లో సాంబార్ గిన్నెలో చనిపోయిన ఎలుక ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్ను సీజ్ చేసి మేనేజ్మెంట్కు నోటీసులిచ్చారు.