ఆదివాసీ గిరిజనుల ఆచార సంప్రదాయాలు చాలా గొప్పవని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం మొదటగా జోడేఘాట్ ను సందర్శించి, కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. గిరిజన ఆచార సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారని తెలిపారు.
కొమురం భీం మ్యూజియంను సందర్శించిన జిల్లా ఎస్పీ
22
Jun