ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను ఆందోళనకు గురిచేసిన కడెం ప్రాజెక్ట్ వరద ఘటన నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2022 జులై 13న ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పోటెత్తింది. నాడు లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు రావడంతో ప్రాజెక్టు తెగిపోతుందని భయపడ్డారు. పట్టణం పూర్తిగా వరద నీటితో మునిగిపోగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కాగా ఈరోజు నాటి ఘటనను ప్రజలు గుర్తు చేసుకున్నారు.
కడెంలో వరద బీభత్సానికి రెండేళ్లు
14
Jul