TG: బడ్జెట్ రూ.లక్షల కోట్లు దాటుతున్నా పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాల పరిస్థితి మెరుగుపడటం లేదు. మంచిర్యాల జిల్లా నెన్నెల మం. కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిల్లలు గొడుగులతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రూఫ్ పైనుంచి నీళ్లు కురుస్తున్నాయి. పురాతన భవనం కావడంతో పైకప్పు దెబ్బతిందని, కొత్త భవనం నిర్మించాలని డిమాండ్లు వస్తున్నాయి
ఎలా చదువుకోవాలి సర్?
26
Jul