జమ్మూకశ్మీర్లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ కలిసి శ్రీనగర్ జిల్లాలోని జబర్వాన్ ఫారెస్ట్ ఏరియాలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించాయి. నేటి ఉదయం ముష్కరులు కనిపించడంతో కాల్పులు జరిగాయి. మరోవైపు బారాముల్లాలోనూ వరుసగా రెండో రోజు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దాడిలో ఒక ఉగ్రవాది మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
11
Nov