AP: ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, స్కీము పొడిగించాలని ప్రధానిని కోరనున్నారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు. నిన్న కూడా పలు శాఖల కేంద్ర మంత్రులను కలిసి నిధుల విషయమై చర్చించిన విషయం తెలిసిందే.
ఇవాళ ప్రధానితో పవన్ భేటీ
27
Nov