AP: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్ను ప్రారంభించనున్నారు. క్యూఆర్ స్కానర్ల ద్వారా సిబ్బంది ఆస్తి, లీజులు, ఇతర పన్నులను వసూలు చేస్తారు. దీనిద్వారా రూ.250 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. కాగా రాష్ట్రంలోని గ్రామాల్లో ఇళ్లు, షాపులు, ఇతర భవనాలు 85 లక్షల వరకు ఉన్నట్లు తేలింది.