అర్ధాంతరంగా భార్యను చదువు మానేయమనడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఇది ఆమె కలలను నాశనం చేయడమేనని పేర్కొంది. ఆమెను చదువుకోకుండా నిర్బంధించడం మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. విడాకులు మంజూరు చేసేందుకు ఇది సరైన కారణమేనని పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఇలాంటివారికి విడాకులు ఇవ్వడం సమంజసమేనని తెలిపింది.
భార్యను చదువు మానేయమనడం క్రూరత్వమే: హైకోర్టు
09
Mar