దేశంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కి చేరింది. నిన్న కర్ణాటకలో ఒకరు, కేరళలో ఇద్దరు, పుదుచ్చేరిలో ఒకరు చొప్పున నలుగురు మరణించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 55కి చేరింది. ఏపీలో నిన్న ఒక్క రోజే 12, TGలో 2 కేసులు వెలుగుచూశాయి.
ప్రస్తుతం ఏపీలో 62, తెలంగాణలో 5 యాక్టివ్ కేసులున్నాయి.