యూపీలోని సీతాపూర్ లో ఓ మాంత్రికుడి మాట విని.. పాముకాటుకు గురై చనిపోయిన 60 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు, ఆవుపేడలో పెట్టి పూడ్చేశారు. ఇలా ఆమెను ఆవుపేడతో కప్పివేస్తే, 24 గంటల్లో ప్రాణాలతో తిరిగి వస్తుందని సదరు మాంత్రికుడు చెప్పాడు. అయితే 24 గంటల తర్వాత పేడ తీసి చూసినప్పుడు అతడు చెప్పింది అంతా అబద్ధమని తేలింది. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు.
చనిపోయిన మహిళను బతికించేందుకు ఆవుపేడలో పూడ్చిన ఫ్యామిలీ!
17
Jul