సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు, గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని అనంతపురం టూటౌన్ సి. ఐ క్రాంతికుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం నగరంలోని సమస్యాత్మక కాలనీలైన నాయక్ నగర్, కృపానందనగర్ లలో కవాతు కొనసాగింది. అనంతరం ఆయా కాలనీల ప్రజలతో మాట్లాడి కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని, కౌంటింగు తర్వాత కూడా గెలుపోటముల ప్రభావం చూపకుండా అందరూ ప్రశాంతంగా మెలగాలని సూచించారు.
కౌంటింగు వేళ గొడవల జోలికెళ్లొద్దు: సీఐ క్రాంతి కుమార్
02
Jun