AP: వైసీపీ అధినేత జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద అమరావతి రైతులు ప్రయత్నించారు. తమ వెంట అరటి, మామిడి, స్వీట్లు, పూల బొకేలతో వచ్చిన వారిని జగన్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘CMగా ఉన్నప్పుడూ జగన్ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు MLAగా ఉన్నప్పుడైనా ఆయనను కలిసి మాట్లాడేందుకు వచ్చాం’ అని రైతులు తెలిపారు. పోలీసులు ఎంతసేపటికీ అనుమతి ఇవ్వకపోవడంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.
జగన్ ను కలిసేందుకు అమరావతి రైతుల యత్నం
07
Jun