LS ఎన్నికల్లో BJPకి మెజారిటీ రాకపోవడంతో NDAలోని మిత్ర పక్షాలు తమకు కేబినెట్లో చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, బిహార్లో ఐదు ఎంపీ సీట్లు గెలుచుకున్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాస్వాన్ మాత్రం ఎలాంటి డిమాండ్ చేయలేదట. ‘నేను కోరుకున్న దానికంటే ఎక్కువ పొందాను. నాకు మంత్రి పదవిపై ఆసక్తి లేదు. మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నాను’ అని పాస్వాన్ చెప్పుకొచ్చారు.
100% స్ట్రైక్ రేట్.. మంత్రి పదవిపై ఆసక్తి లేదన్న చిరాగ్
07
Jun