తిరుమల లడ్డు వివాదం పై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. అసలు టెండరింగ్ ప్రక్రియను ఆయన తప్పుబట్టారు. వెంటనే ఈ లడ్డూ అంశంపై నిజానిజాలపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు రంగరాజన్ తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వివాదంపై ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. తాజాగా ఈ వివాదంపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కూడా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం దారుణమని.. ఇది భయంకరమైన, నమ్మలేని నిజం అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యి కోసం టెండరింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని.. ఈ కల్తీ విషయంలో నిజానిజాలపై విచారణ చేపట్టాలని కోరారు.
పవన్ కళ్యాణ్ ఆలోచన బాగుంది.. చిలుకూరు ప్రధానార్చకులు రంగరాజన్
21
Sep