రైలు బోగీలో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు అసిస్టెంట్ లోకో పైలట్ సాహసమే చేశారు. బ్రిడ్జిపైకి రాగానే 21వ బోగీలో ఎయిర్ లీకేజీ సమస్య ఏర్పడటంతో రైలు ఆగిపోయింది. దీంతో అసిస్టెంట్ లోకో పైలట్ కుమార్ ప్రాణాలకు తెగించి ఇంజిన్ నుంచి 21వ బోగీకి వెళ్లారు. సమస్యను సరిచేసి మళ్లీ ఇంజిన్ వద్దకు వచ్చి రైలును నడిపించారు. అస్సాంలో జరిగిన ఈ ఘటన వీడియో వైరలవుతోంది. ఆయన చేసిన సాహసాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
గ్రేట్.. ప్రాణాలకు తెగించిన పైలట్
02
Oct