పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో బిలియనీర్ ముకేశ్ అంబానీ ఎమోషనల్ అయ్యారు. ‘టాటా మరణం ఆయన కుటుంబానికే కాదు, దేశానికే తీరని లోటు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిని భారత్కు తీసుకువచ్చారు. టాటాలోని గొప్పతనం, మానవతా విలువలు ఆయనపై మరింత గౌరవం పెంచాయి. నేను ఓ మంచి స్నేహితుడిని కోల్పోయా. టాటా ఎప్పటికీ నా హృదయంలోనే ఉంటారు. రిలయన్స్ తరఫున ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ముకేశ్ పేర్కొన్నారు.
టాటా ఎప్పటికీ నా గుండెల్లోనే: ముకేశ్ అంబానీ
10
Oct