ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు
01
Nov