యూపీలోని లక్నోలో సీటు కోసం తోటి ప్రయాణికుడిని కొందరు హత్య చేశారు. జమ్మూ నుంచి వారణాసి వెళ్లే రైలులో తౌహిద్ (24) ప్రయాణిస్తున్నాడు. సీటు విషయమై కొందరితో ఆయన గొడవపడగా వారు కత్తితో పొడవడంతో మరణించాడు. గాయాలతో ఉన్నప్పుడే తౌహిద్ తన సోదరులు తౌసిఫ్ (27), తాలిబ్ (20)కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు నిహాల్ గఢ్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కగా వారిపై కూడా దాడి చేశారు. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సీటు కోసం ఘాతుకం.. తోటి ప్రయాణికుడి హత్య
07
Dec