J&Kలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని AP CM చంద్రబాబు ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో AP జవాన్ మృతి.. CM దిగ్భ్రాంతి
22
Jan