ఉత్తరప్రదేశ్లోని బులందహర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్లో పనిచేసే యువకుడిపై కొంతమంది దుండగులు ముసుగు ధరించి కర్రలతో దారుణంగా కొట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటన పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పెట్రోల్ బంక్లో యువకుడిని దారుణంగా కొట్టిన దుండగులు
19
Jun