ఆదివారం గాజావ్యాప్తంగా జరిగిన దాడుల్లో 73 మంది ప్రాణాలు కోల్పోగా, 150 మందికి గాయాలైనట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిలో చాలామంది ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న వారిపై దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన దాడులా, దుండగులు జరిపిన కాల్పులా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు
సాయం కోసం చూస్తుండగా దాడి.. 73 మంది మృతి
21
Jul