AP: రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్కతా లాంటి మార్కెట్లకు తరలించి విక్రయించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు CMO తెలిపింది. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ట్వీట్ చేసింది. అరటి ధరలు, కొనుగోళ్లపై నిత్యం వ్యాపారులతో మాట్లాడాలని ఆదేశించినట్లు పేర్కొంది. మార్కెట్లకు అరటి లోడు రైల్వే వ్యాగన్లను పంపేందుకూ చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించింది.
అరటిని ముంబై, కోల్కతా మార్కెట్లకు తరలించండి: సీఎం
23
Nov