జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. తొలుత మోదర్గామ్ ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకొని జవాన్లు కాల్పులు జరిపారు. ముష్కరులు ఎదురుదాడి చేయడంతో ఓ జవాన్ మరణించారు. అనంతరం చిన్నిగామ్లో జరిగిన ఎన్ కౌంటర్లో మరో జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.