AP: విజయవాడలో వరద విలయంలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు మరిన్ని NDRF బృందాలు వచ్చాయి. సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లుథియానా నుంచి సైనిక విమానంలో అదనపు NDRF బృందాలను పంపారు. కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న సిబ్బందిని బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్లారు. అక్కడ వారు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు.
గన్నవరం చేరుకున్న మరిన్ని NDRF బృందాలు
03
Sep