హైదరాబాద్లో ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనం సందడి కొనసాగుతోంది. తాజాగా శోభాయాత్ర సెక్రటేరియట్ వద్దకు చేరుకుంది. సచివాలయం ముందు నుంచి తరలివెళ్తున్న 70 అడుగుల మహాగణపతిని చూసేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని బంధించేందుకు కెమెరామెన్లతో పాటు భక్తులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ వీడియోను మీరూ చూసేయండి