AP: నంద్యాలలో 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర హత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. బాలికను రేప్ చేసి, చంపి కాలువలో పడేశామని నిందితులు చెప్పడంతో NDRF బృందం రంగంలోకి దిగింది. 30మంది నీటి అడుగున గాలిస్తున్నారు. కాగా 3వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె సీనియర్లే హత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు 6, ఒకరు 7వ తరగతి చదువుతున్నారు. చిన్నవయసులోనే వారు ఈ తరహా నేరానికి పాల్పడటం నివ్వెరపరుస్తోంది.
ఘోరం.. బాలికపై హత్యాచారం చేసింది 6,7 తరగతుల పిల్లలే!
12
Jul