AP భవిష్యత్తు, పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి తాము పూర్తి సహకారం అందిస్తామని డిప్యూటీ CM పవన్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో ఖజానా ఖాళీ అయ్యింది. పోలవరం, అమరావతి ఆగిపోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. ఎవరూ కక్ష సాధింపులకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
నేను తప్పు చేసినా చర్యలు తీసుకోండి: పవన్
24
Jul