TG: కని, పెంచి, చదివించి, పెళ్లిళ్లు చేసి, ఆస్తిని కూడా పంచిన తల్లికి పిడికెడు అన్నం పెట్టడానికి నలుగురు కొడుకులకు చేతులు రాలేదు. ఓ చిన్న గుడిసెలో తల్లిని ఉంచి పట్టించుకోవడం మానేశారు. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్లో జరిగింది. ఆకలి బాధతో ఆ తల్లి పోలీసు స్టేషన్కు వెళ్లింది. ఆమె వేదన విన్న ఎస్సై న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పంపించారు.
నలుగురు కొడుకులు.. అమ్మకు అన్నం పెట్టట్లేదు
26
Aug