తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు,
వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ భారీ ఎత్తున నష్టం చేకూరింది. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ సమయంలో సహాయం అందించేందుకు పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. వరదల సమయంలో తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి చెరొక 50 లక్షల చొప్పున సహాయం చేస్తానని అందిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను మహేశ్ బాబు నిలబెట్టుకున్నారు.